అమరావతి : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి దర్శనానికి 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా వీరికి 12 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికార వర్గాలు వెల్లడించాయి. నిన్న శ్రీవారిని 77,855 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 28,925 మంది భక్తులు తలనీలాలు సమర్పించు కున్నారు. సెప్టెంబరు 28న ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి చేతులమీదుగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న అన్నప్రసాదం కాంప్లెక్స్కు ఆనుకుని నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని ఈవో పరిశీలిం చారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు.