హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): విశాఖపట్నానికి మకాం మార్చడంపై ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. విశాఖ పర్యటనలో భాగంగా సోమవారం ఆయన ఐటీ హిల్స్ వద్ద ఇన్ఫోసిస్ కార్యాలయం, పరవాడ సెజ్లో ఫార్మా యూనిట్ను ప్రారంభించారు.
డిసెంబర్ నాటికి పాలనా విభాగమంతా విశాఖకు వస్తుందని, విశాఖ నుంచే పాలన కొనసాగిస్తామని చెప్పారు.