అమరావతి : సినమా పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఏపీ సీఎం జగన్ను మెగాస్టార్ చిరంజీవి కలిశారని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. అయితే కొందరు ఈ అంశాన్ని రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అన్నదమ్ములను విడదీసి రాజకీయం చేయాలనే ఆలోచన జగన్కు లేదని పేర్కొన్నారు. సినిమా పరిశ్రమను కాపాడేందుకు చేయగలిగినంతా చేస్తారని వివరించారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఏపీలో దళితులు, కాపుల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ పార్టీని పెట్టినప్పటి నుంచి జగన్ అన్ని ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నారని వెల్లడించారు.