విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉన్న ఆర్కే బీచ్లో (RK Beach) సముద్రం ముందుకొచ్చింది. సముద్రపు అలల తాకిడికి భూమి బీటలువారింది. బీచ్ నుంచి దుర్గాలమ్మ గుడివరకు అర కిలోమీటర్ మేర కోతకు గురయింది. బీచ్ సమీపంలో ఉన్న చిల్డ్రన్పార్కులో పది అడుగుల మేర మట్టి కోతకు గురైంది. దీంతో పార్కు ప్రహరీ గోడ కూలిపోయింది. అక్కడ ఉన్న బెంచీలు విరిగిపోయాయి.
ఈ నేపథ్యంలో పిల్లల పార్కుకు వచ్చే మార్గాన్ని మున్సిపల్ అధికారులు మూసివేశారు. ప్రజలు అటువైపు వెళ్లడానికి పోలీసులు అనుమతించడంలేదు. జవాద్ తుపానుతో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతోనే సముద్రం ముందుకొచ్చి ఉంటుందని భావిస్తున్నారు.