అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు( Chandra Babu ) కు లక్షల కోట్లు సంపాదించాలనే లక్ష్యం తప్ప ప్రజలకు మేలు చేసే ఉద్దేశం లేదని వైసీపీ నాయకురాలు లక్ష్మిపార్వతి( Lakshmi Parvathi ) ఆరోపించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఆరు లక్షల కోట్లు సంపాదించారని ( Income ) విమర్శించారు.
చంద్రబాబు జీవితమంతా వివాదాస్పదమేనని పేర్కొన్నారు . తన అవసరాలకు ఎవరినైనా వాడుకుంటారని, కాంగ్రెస్ను ఒకసారి, నరేంద్ర మోదీని విమర్శించి మరోసారి వారి చెంతకే చేరి లబ్దిపొందాడని అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంతో భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నాడని విమర్శించారు.
క్రెడిట్ చోరీలో చంద్రబాబు నిష్ణాతులని, హెరిటేజ్ సంస్థలోని వాటాదారులను కూడా బలవంతంగా బయటకు పంపారని వెల్లడించారు. ఆయన చదువుకునే సమయంలో పరీక్షలను వేరే వారితో రాయించి పాసయ్యారని తెలిపారు. కుట్రలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని విమర్శించారు.