అమరావతి : ఏపీలో సంచలనం కలిగించిన న్యూడ్ వీడియోను ఎదుర్కొంటున్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ టీడీపీ అధినేత చంద్రబాబు ఓటుకునోటు కేసుపై స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో ఇరుకున్న చంద్రబాబు ఆడియో కేసును స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపిస్తే తనపై వచ్చిన ఆరోపణలపై విచారణకు తానూ కూడా సిద్ధమేనని ప్రకటించారు.
చంద్రబాబు ఆడియోను అమెరికా ల్యాబ్లో టెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఒక సామాజిక వర్గానికి చెందిన కొంతమంది టీడీపీ నాయకులు తనపై ఫేక్ వీడియో కాల్ను సృష్టించి దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. ఒరిజనల్ వీడియో తన వద్ద ఉందని పోలీసులు అడిగితే ఫోన్ ఇస్తానని వెల్లడించారు. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మహిళతో అసభ్యకరంగా వీడియోకాల్లో మాట్లాడినట్లు రుజువు కాలేదని వివరించారు.
తనను రాజకీయంగా ఎదుర్కొనలేకే కుట్రలతో ఇబ్బందులపాలు చేయాలని టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.