హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): తనపై నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టివేయాలని చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్పై దీపావళి తర్వాత తీర్పు వెలువరించనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే వాదనలు పూర్తికావడంతో గత నెలలోనే తీర్పును రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ను ఆమోదిస్తే ఈ కేసుతో పాటు మిగతా కేసుల్లోనూ చంద్రబాబుకు ఊరట లభిస్తుంది.
మరోవైపు ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను మరోసారి వాయిదా వేసింది. సెక్షన్ 17ఏ నిబంధన ఈ కేసులోనూ ఉన్నందున స్కిల్ తీర్పు వచ్చాక ఈ కేసు విచారణను 30న చేపడతామని ప్రకటించింది.