అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పాలిసెట్(ఏపీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 404 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలు పదిరోజుల్లో విడుదల కానున్నాయి.
మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 84 ప్రభుత్వ, 175 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 29 విభాగాల్లో మొత్తం 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన వారికి మాత్రమే సీట్లు లభిస్తాయని ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ డాక్టర్ పోలీ భాస్కర్ తెలిపారు.