తాడేపల్లి: వైసీపీ ప్లీనరీ సమావేశాలకు ముందుగా పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాలకు అధ్యక్షులను బుధవారం నియమించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగాయని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నిందికొట్కూరుకు చెందిన బైరెడ్డి సిద్దార్థ్రెడ్డిని నియమించారు. ఈయనతో పాటు మరో 24 పదవులకు అధ్యక్షులను నియమించారు.
అదేవిధంగా మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఎమ్మెల్సీ పోతుల సునీత, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా గుంటూరుకు చెందిన పానుగంటి చైతన్య, రైతు విభాగం అధ్యక్షుడి గుడివాడకు చెందిన ఎంవీఎస్ నాగిరెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడిగా గురజాలకు చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎస్టీ సెల్కు పాడేరుకు చెందిన శ్రీమతి వెంకటలక్ష్మి (హిల్ ఏరియా), మాచర్లకు చెందిన హనుమంత్నాయక్ (ప్లేన్ ఏరియా), ట్రేడ్యూనియన్కు విజయవాడకు చెందిన డాక్టర్ గౌతమ్రెడ్డి, వాణిజ్య విభాగానికి విజయవాడకు చెందిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ను నియమించారు. అలాగే, పోలింగ్ బూత్ విభాగానికి తాడికొండకు చెందిన హర్షవర్ధన్రెడ్డి, మైనార్టీ సెల్కు కర్నూలుకు చెందిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, సాంస్కృతిక విభాగానికి విజయనగరానికి చెందిన శ్రీమతి వంగపండు ఉష, వైఎస్సార్ సేవాదల్కు విజయవాడకు చెందిన ఎమ్మెల్సీ మహ్మద్ రహుల్లా, డాక్టర్స్ విభాగానికి కాకినాడకు చెందిన డాక్టర్ పితాని అన్నవరంను నియమిస్తూ వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.
కాగా, స్టేట్ సోషల్ మీడియా విభాగానికి గుర్రంపాటి వెంకట దేవేంద్రరెడ్డి (మైదుకూరు), పుట్టా శివశంకర్ (కమలాపురం), చల్లా మదుసూధన్రెడ్డి (కమలాపురం), పామిరెడ్డిగారి మదుసూధన్రెడ్డి (నంద్యాల), పబ్లిసిటీ విభాగానికి పుట్టా ప్రతాప్ రెడ్డి (కమలాపురం), ఆర్ ధనంజయ్రెడ్డి (రైల్వే కోడూరు), క్రిస్టియన్ మైనార్టీ సెల్కు తాడికొండకు చెందిన ఫాదర్ మద్దు బాలస్వామి, పంచాయత్ వింగ్కు పెదకూరపాడుకు చెందిన మేకల హనుమంతరావు, వైఎస్సార్టీఎఫ్కు ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి (కదిరి), గ్రీవెన్స్ సెల్కు అంకమ్రెడ్డి నారాయణరెడ్డి (తుని), ఐటీ వింగ్కు సునీల్ పోసిమ్రెడ్డి (నెల్లూరు), ఎన్నారై వింగ్కు మేడపాటి వెంకట్ (ఆచంట), వికలాంగుల విభాగానికి బందేల కిరణ్రాజు (విజయవాడ సెంట్రల్), కేంద్ర కార్యాలయం ఇంఛార్జీగా గుంటూరుకు చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, క్రమశిక్షణా కమిటీ చైర్మన్గా ఎమ్మెల్సీ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (బాపట్ల) ను నియమిస్తూ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్లీనరీని గుంటూరులో జూలై 8, 9 తేదీల్లో నిర్వహించనున్నారు. డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా జూలై 8 వ తేదీని ఎంపిక చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మూడేండ్ల పదవీకాలం పూర్తిచేసుకున్నదని చెప్పారు. వైసీపీ ప్లీనరీ చివరిసారిగా 2017లో జరిగింది.