విశాఖపట్నంలోని మధురవాడలో విషాదం జరిగింది. సరిగ్గా జీలకర్ర బెల్లం పెట్టే సమయంలోనే వధువు కుప్పకూలిపోయింది. వధువు సృజనను బంధువులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది.
శివాజీ- సృజన వివాహం బుధవారం రాత్రి 7 గంటలకు జరగాల్సి వుంది. సరిగ్గా ముహూర్త సమయానికి వధూ వరులు పెళ్లి పీటలు ఎక్కారు. బంధువులందరూ సంతోషంతో వున్నారు. సరిగ్గా జీలకర్ర బెల్లం పెట్టే సమయంలోనే వధువు కుప్పకూలిపోయింది. దీంతో పెళ్లి మండపంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.