తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూటికి నూరు శాతం న్యాయపరంగా అమరావతే రాజధానిగా ఉంటుందని వైసీపీ పార్లమెంట్ సభ్యుడు రఘురామ రాజు అన్నారు. అడ్డం పడే మేఘాలు అశశాశ్వతమని అమరావతికి సృష్టిస్తున్న ఆటంకాలన్ని తొలగిపోతాయని ధీమాను వ్యక్తం చేశారు. తిరుపతిలో ఈ రోజు అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు తిరుపతి విమానశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జేఏసీ నాయకులు స్వాగతం పలికారు.
ఏపీలో మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు స్పందించారు. బొత్స చేసినవి సొంత మాటలు కావని .. అరువు మాటలని.. ఎవరో చెప్పిన మాటలు ఈయన మాట్లాడుతున్నారని విమర్శించారు. వేరే వారు మాట్లాడ లేక ఈయన చేత మాట్లాడిస్తున్నారని పేర్కొన్నారు. సత్తిబాబు మంచివాడని చెప్పడం లేదు.. చెడ్డవాడు కూడ కాదని ఆయన అన్నారు. ఆయన మాటలకు జాలి పడాలే తప్పా.. బాధ పడకూడదని అన్నారు.