Srisailam | ఈ నెల 22న అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం జరుగనున్నది. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అతిధులకు ఆహ్వానాలు పంపుతున్నారు. అందులో భాగంగా శ్రీశైల మహా క్షేత్రంలోని ఇద్దరు ఆధ్యాత్మిక గురువులకు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలు పంపింది. శ్రీశైలంలోని జగద్గురు పీఠాధిపతి, శ్రీ దత్త సాయి మౌన స్వామి ఆధ్యాత్మిక ఆశ్రమం గురువు శ్రీ శివ స్వామికి దేవస్థానం ఈవో పెద్దిరాజు ఆహ్వాన పత్రిక అందజేశారు.
విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జగద్గురు పీఠాధిపతి, శ్రీ దత్త సాయి మౌన స్వామి ఆధ్యాత్మిక ఆశ్రమం గురువు శ్రీ శివ స్వామికి ఆహ్వాన పత్రిక, అక్షింతలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక రామసేవకులు గిరిధర్, చెన్నకేశవ,చదువుల శ్రీను,హనుమాన్ నాయక్, రామకృష్ణ, ఆత్మకూరు విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు శ్రీ సుదర్శన్, భానుమూర్తి, మురళీధర్ గుప్తా, పవన్ కుమార్ పాల్గొన్నారు. గోశాల నిర్వాహకులు రాజు, సాధువుల గుట్ట ఆశ్రమాల వ్యవస్థాపకులు పాల్గొన్నారు