అమరావతి : అన్నమయ్య జిల్లా గుట్టపాలెం చెక్పోస్టు వద్ద పోలీసులపై తమిళ కూలీలు దాడి చేశారు. చెక్పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా అటువైపుగా లారీలో వచ్చిన తమిళ కూలీలు ఒక్కసారిగా పోలీసులపైకి రాళ్లు, కర్రలతో దాడి చేశారు. అనంతరం 8 మంది తమిళ కూలీలను అదుపులోకి తీసుకుని విచారించగా వాహనంలో రూ. 34 లక్షల విలువగల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.