అమరావతి : చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని శ్రీ వశిష్ట ఆశ్రమం ప్రధాన అర్చకుడు ప్రసాద్(22) ఆత్మహత్య చేసుకున్నాడు. కాశీలో అర్చకత్వం చేసి నేపాల్ నుంచి ఏడాది క్రితం ఇక్కడికి వచ్చిన ఆయన శ్రీ స్వరూపానందగిరి ఆధ్వర్యంలో నడుపుతున్న శ్రీవశిష్ట ఆశ్రమంలో ప్రధాన అర్చకుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అర్చకుడు ఆత్మహత్యకు గల కారణాలపై చంద్రగిరి పోలీసులు విచారణ జరుపుతున్నారు.