RK Roja | రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి ఆర్కే రోజా గురించి తెలియనివారు ఎవరుంటారు. అటు రాజకీయాల్లో, ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ఆమె. సినిమాల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలిగిన రోజా ప్రస్తుతం రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె జీవితంపై ఓ పుస్తకం విడుదలైంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ రోజా జీవిత చరిత్రపై బుక్ విడుదల కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రంగుల ప్రపంచం నుండి రాజీకీయాల్లోకి అనే పేరుతో రూపొందించిన రోజా జీవిత చరిత్ర పుస్తకాన్ని భూమన కరుణాకర్ రెడ్డి, అంబటి రాంబాబు కలిసి శుక్రవారం విడుదల చేశారు. పుస్తకం విడుదల సందర్భంగా పలువురు నాయకులు, సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇకపోతే.. ఈ పుస్తకం ఆధారంగా చేసుకుని రోజా బయోపిక్ ఎవరైనా తీసేందుకు ప్లాన్ చేస్తారేమో చూడాలి.
మంత్రి రోజా జీవిత చరిత్రపై బుక్ విడుదల
“ రంగుల ప్రపంచం నుండి రాజీకీయాల్లోకి “ అనే పేరు రోజా జీవిత చరిత్రపై పుస్తకం విడుదల చేసిన అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి. pic.twitter.com/Ph9saUK0LI
— Telugu Scribe (@TeluguScribe) March 22, 2024