అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వం శుక్రవారం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ మేరకు శాసన సభ, మండలి సమావేశాల్లో ఉప సంహరణ బిల్లులను ఆమోదించినట్లు పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మి ప్రభుత్వం తరుఫున అఫిడవిట్ను సమర్పించారు. ఏపీలో రాజధాని అమరావతిని కొనసాగించాలని గత రెండేళ్లుగా రైతులు, ఐక్యకార్యచరణ నాయకులు కోర్టులో పిటిషన్లు వేశారు. ఈ కేసులను విచారిస్తున్న త్రిసభ్య ధర్మాసనం రోజువారీగా విచారిస్తుంది.
ఈ కేసుల విచారణ తుది దశకు వస్తున్న తరుణంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తమ బిల్లులను మంత్రివర్గ సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో ఉపసంహరించుకుంటున్నట్లు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలియజెప్పారు. ఇందుకు సంబంధించన అఫిడవిట్ను దాఖలు చేయాలని అదేరోజు ఆదేశించినప్పటికీ ఏజీ కోరిక మేరకు ఈనెల 26కు అఫిడవిట్కు సమయాన్ని కోరారు. ఈ సందర్భంగా శాసనసభ, శాసనమండలిలో ఉపసంహరణ బిల్లులను ఆమోదించినట్టు శుక్రవారం అఫిడవిట్ను దాఖలు చేశారు. మరోవైపు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మహాపాదయాత్రను నిర్వహిస్తున్నారు.