అమరావతి : కేంద్రంలోని బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి రెండు ప్రధాన పార్టీలకు చెందిన అధ్యక్షులు కలుసుకోవడం రాజకీయవర్గాల్లో చర్చాంశానీయంగా మారింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు(Chandra Babu) కేంద్రమంత్రి అమిత్ షా (Minister Amit Shah ) ను కలిసిన 48 గంటల్లోనే వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) తో భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు 25 నిమిషాల పాటు ప్రధానితో ఏపీకి చెందిన పలు అంశాలపై చర్చించడంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.
మరికొద్దిరోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elecion) జరుగుతుండగా చంద్రబాబు బీజేపీతో పొత్తుల అంశంపై అమిత్ షాతో చర్చించారు. ఇప్పటికే జనసేన (Janasena) బీజేపీతో స్నేహాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ మూడు రాజకీయ పార్టీలు కలిసి రాబోయే ఎన్నికల్లో కలిసి పోటికి పరస్పర అంగీకారం ఇప్పటికే కుదిరింది. అయితే ఎన్ని అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు అనే అంశం తేలాల్సి ఉంది. అదే విషయం అమిత్ షాతో చంద్రబాబు సమావేశం అయినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలో గెలిచిన వైసీపీ అప్పటి నుంచి కేంద్రంతో సఖ్యతను కొనసాగిస్తూ వస్తుంది. 2024 ఎన్నికల అనంతరం కూడా మద్దతు కేంద్రానికి ఉంటుందనే సమాచారం ప్రధానికి వైఎస్ జగన్ వివరించడంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై చర్చించినట్లు తెలుస్తోంది.