అమరావతి : గుండెపోటుతో మరణించిన కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా భౌతికకాయానికి ఏపీ సీం జగన్మోహన్రెడ్డి నివాళులర్పించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతిని వ్యక్తం చేశారు. “నా సోదరి కరీమున్నీసా ఆకస్మిక మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. నిన్న శాసనమండలికి హాజరై రాత్రి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించడం చాలా బాధాకరం.
ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. వారికి నాతో సహా పార్టీ అండగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు. సీఎం వెంట హోం మంత్రి సుచరిత, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితర వైఎస్సార్సీపీ నాయకులు ఎమ్మెల్సీ కరీమున్నిసా భౌతికకాయానికి నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి కరీమున్నీసా పార్టీ కోసం పని చేశారు. ఈ ఏడాది మొదట్లో ఆమె ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. శుక్రవారం శాసనమండలిలో ఆమె సీఎం జగన్ను, శాసనమండలి చైర్మన్గా నూతనంగా ఎన్నికైన మోషేన్ రాజును కలిశారు.