తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ అత్యంత ఉత్సాహం, ఆనందంతో పండగను జరుపుకోవాలని అభిలషించారు. మన మన సొంత గ్రామాల మీద మనకున్న మమకారాన్ని ఆవిష్కరించే పండగ సంక్రాంతి అని, రైతులకు, వ్యవసాయానికి ప్రజలంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక అని జగన్ వివరించారు. అలాగే తెలుగు వారికే ఉన్న ప్రత్యేక కళలకు ప్రతీక కూడా సంక్రాంతి అని అన్నారు.
భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాలు, పచ్చని పైర్లు ఇవన్నీ… సంక్రాంతికి శోభను చేకూర్చుతాయని జగన్ అన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండగలను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని జగన్ ఆకాంక్షించారు.