ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయ్యారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ గురించే వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. అలాగే కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ కార్యక్రమానికి గవర్నర్ను సీఎం ఆహ్వానించారు. నూతన మంత్రివర్గంలోకి ఎవరెవర్ని తీసుకుంటున్నారో ఆ జాబితాను సీఎం గవర్నర్కు వివరించారు. వీటన్నింటితో పాటు నూతన జిల్లాల ఏర్పాటు, ఢిల్లీ పర్యటన వివరాలను కూడా సీఎం జగన్ గవర్నర్ విశ్వభూషణ్కు వివరించినట్లు తెలుస్తోంది.
ఈ నెల 11న కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు సీఎం జగన్ ముహూర్తం ఖరారు చేశారు. ఉదయం 11ః30 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం నాడు ఆఖరిసారిగా సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఆ తర్వాత మంత్రులందరితో రాజీనామా చేయించి, కొత్త మంత్రులను ప్రకటిస్తారని సమాచారం.