అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీకి బయలు దేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం వరకు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. మధ్యాహ్నం 1.45 గంటలకు ఆయన ఢిల్లీకి చేరుకుంటారని, అనంతరం జన్పథ్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షాను కలిసే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి . ఏపీకి సంబంధించిన పెండింగ్ అంశాలపై ఆయన చర్చించే అవకాశాలున్నాయని తెలిపారు.
ఏపీ సీఎం జగన్ చివరిసారిగా ఏప్రిల్ 5న ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పలు సమస్యలను, ఏపీ విభజన చట్టాన్ని అమలు చేయాలని, పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్ నిధులు విడుదల చేయాలని కోరారు.