అమరావతి : అనకాపల్లి జిల్లాలోని పరవాడ పారిశ్రామక సెజ్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా యి. ఇవాళ పరవాడ పరిశ్రమ కొరి ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్లోని యూనిట్-2లో రియాక్టర్ పైపు పగిలి మంటలు చెలరేగాయి. దీంతో గోడ, అద్దాలు ధ్వంసమయ్యాయి . అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
ఈ ఘటనలో ఇద్దరు కార్మికులకు స్వలగాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. మూడు నెలలుగా ఈ సెజ్లో విషపు రసాయనాలు వెలువడి నలుగురు మృత్యువాత పడి మరికొందరు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. పరిశ్రమల్లో ప్రమాదాలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశించినా ప్రమాదాలు చోటు చేసుకుంటుండడ పట్ల కార్మికుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది .