ఒంటిమిట్ట : కడపలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (Brahmotsavams ) వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు ఆదివారం స్వామివారు మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామివారిని కేరళ డ్రమ్స్, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
అర్చకులు మాట్లాడుతూ భాగవతం ప్రకారం దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరంలో కోరుకున్న అమృతం లభిస్తుందని తెలిపారు. దానిని పంచుకోవడంలో ఇద్దరి మధ్య కలహం ఏర్పడిందని, ఆ కలహాన్ని నివారించి, దేవతలకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంతో సాక్షాత్కరించాడని వివరించారు.
శ్రీ సీతారాముల కల్యాణానికి కోటి తలంబ్రాలు సమర్పణ
ఒంటిమిట్టలో సోమవారం జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం గోటితో ఒలిచిన కోటి తలంబ్రాల ( Talambras) ను ఆదివారం సమర్పించారు. మొత్తంతలంబ్రాలను ఆలయం వద్ద డిప్యూటీ ఈవో నటేష్ బాబు, అర్చకులు శ్రావణ్ కుమార్ సమక్షంలో అందించారు.