హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) సీఈవో ముఖేశ్కుమార్ మీనా నోటీసులు జారీ చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు పెట్టిందని వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుపై స్పందించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా చంద్రబాబుకి నోటీసులు ఇచ్చారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అసభ్యకర పోస్టులను 24 గంటల్లోగా తొలిగించాలని సీఈవో ముఖేశ్కుమార్ మీనా ఆదేశించారు.