మందమర్రి ఏప్రిల్ 28 : మున్సిపాలిటీ పరిధిలో 45 ఏండ్లు దాటిన వారందరూ కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని మందమర్రి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు సూచించారు. మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు దీపక్నగర్లో గల పట్టణ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి కొవిడ్ వ్యాక్సిన్ వేసుకునేందుకు వస్తున్న ప్రజలు ఎండలో వేచి ఉంటున్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ రాజు దృష్టికి వార్డు టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎండీ సలావుద్దీన్, వార్డు సమన్వయ కర్త బర్ల సదానందం తీసుకెళ్లారు. ఇందుకు మున్సిపల్ కమిషనర్ స్పందించి, దవాఖాన ఆవరణలో బుధవారం షెడ్నెట్లను ఏర్పాటు చేశారు. దవాఖాన ఆవరణలో పేరుకు పోయిన పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ కరోనా తీవ్రత అధికంగా ఉన్నందున అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచించారు. తప్పని సరిగా మాస్కును ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ వాడాలని సూచించారు. గుంపులుగా ఉండవద్దని తెలిపారు. పట్టణంలోని వ్యాపారులు కొవిడ్ నిబంధనలను విధిగా పాటించాలని మాస్కులు లేకుండా వచ్చే వారికి ఎలాంటి వస్తువులు విక్రయించవద్దని సూచించారు.
కోటపల్లి, ఏప్రిల్ 28 : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యం లో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో కే భాస్కర్ సూచించారు. కోటపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం పంచాయితీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
నస్పూర్లో పారిశుధ్య పనులు ముమ్మరం..
సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 28 : నస్పూర్ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. 2వ వార్డులో కౌన్సిలర్ బోయ మల్లయ్య ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది వాడ వాడలా సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. మురుగు కాలువల్లో బ్లీచింగ్తో క్లోరినేషన్ చేశారు. 19వ వార్డులోని శ్రీరాంనగర్ ఏరియాలో డ్రైనేజీని కౌన్సిలర్ రేగుంట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జేసీబీతో చదును చేయించారు. కరోనా వేళ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్యక్రమాలకు చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని కౌన్సిలర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ ముక్కెర వెంకటేశ్, మాజీ జడ్పీటీసీ తిప్పని రామ న్న, నాయకులు బాకం శంకర్, వేల్పుల రవీందర్, చెల్ల విక్రమ్, తిప్పని రాయలింగు, ధనిశెట్టి మనీశ్, తిప్పని శ్రీనివాస్, తడికొప్పుల వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.