హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి జరగనున్నాయి. ఉదయం 10:30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసగించనున్నారు. 11:30 గంటలకు బీఏసీ సమావేశం జరుగనున్నది. 14న ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
అలాగే అసెంబ్లీ సమావేశాల్లో తొలిసారిగా డిజిటల్ సంతకం ప్రవేశపెట్టనున్నట్టు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలకు ఏపీ మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్మోహన్రెడ్డి హాజరు కానున్నట్టు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు.