అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వరద ప్రభావిత ప్రాంతాలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. శుక్రవారం ఉదయం హెలికాప్టర్ నుంచి ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత గ్రామాల్లో ఆయన ఏరియల్ సర్వే కొనసాగనుంది. సీఎం ఏరియల్ సర్వే కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగన్ కోరారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.