Srireddy : నటి శ్రీరెడ్డి మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై నోరు పారేసుకుంది. ఏపీలో తిరుమల లడ్డూ వివాదం హాట్ టాపిక్ అయిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ విషయంపై ఫోకస్ చేశారు. లడ్డూ వివాదాన్ని చులకనగా చూసినా, మాట్లాడినా వారిపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్పై నటి శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి శ్రీరెడ్డి సపోర్టుగా మాట్లాడారు. అప్పట్లో టీడీపీ నేతలను, మాజీ మంత్రులను ఓ ఆటాడుకున్నారు. తన పరుష పదజాలంతో దూషణలు చేసే శ్రీరెడ్డి తాజాగా పవన్ కళ్యాణ్ మీద కూడా అలాంటి కామెంట్స్ చేశారు. ‘హిందూత్వం పేరు అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే యెదవ, క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నపుడు ఈ సనాతన ధర్మాన్ని ఏ సంతలో అమ్మేసావురా సన్నాసి..?’ అని వ్యాఖ్యానించారు.
‘కమ్యూనిస్టు భావాలు అంటవ్, దీక్షలంటవ్ ఏమన్నా మ్యాచింగ్ ఉందా..? అసలు దీపంతో సిగరెట్ వెలిగించుకున్నవాడికి’.. అంటూ డిప్యూటీ సీఎం పవన్పై ఘాటు విమర్శలు చేశారు. దాంతో జనసేన పార్టీ అభిమానులు, ఫాలోవర్లు శ్రీరెడ్డిని సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు.