అమరావతి : ఏపీలో సంచలనంగా మారిన డిగ్రీ విద్యార్థి అనూష హత్య కేసులో నిందితుడు విష్ణువర్దన్రెడ్డికి జీవిత ఖైదు( Life imprisonment ) విధిస్తు కోర్టు తీర్పు నిచ్చింది. రెండేళ్ల తరువాత నరసరావుపేట(Narsarao peta) కోర్టు(Court) ఈ శిక్షను ఖరారు చేసింది . 2021 ఫిబ్రవరి 21న నరసరావుపేటలో విద్యార్థి అనూష(Student Anusa) దారుణ హత్య(Murder case)కు గురైంది. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.
నిందితుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలంటూ రాజకీయ పార్టీలు, విద్యార్థి, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి. పోలీసులు(Police case) కేసు నమోదు చేసుకుని అరెస్టు చేసి నరసరావు పేట కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించారు. అప్పటి నుంచి కేసు కోర్టులో నడుస్తుంది. విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడుతూ నిందితుడికి ఉరిశిక్ష పడుతుందని భావించామని, అయితే ఇప్పటికైనాశిక్ష పడిందని పేర్కొన్నారు.