అమరావతి : వరద బాధితులను పరామర్శించడానికి పంటులో వెళ్లిన అధికారులకు పెను ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లాలో భారీ వర్షాలకు గ్రామాలు నీట మునిగాయి. వరద గ్రామాల్లో ప్రజలను పరామర్శించేందుకు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, అధికారులు చిన్నపాటి పంటులో రుద్రమకోటకు వెళ్లారు.
అక్కడి నుంచి వేలేరుపాడు వద్ద లాంచ్లో కలెక్టర్, ఎమ్మెల్యే, అధికారులు ఎక్కగా మరో పంటులో ఉన్న ఎంపీపీ లక్ష్మీదేవి, జడ్పీటీసీ రామలక్ష్మి, వైసీపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఎస్సై సాధిక్ లాంచి ఎక్కే సమయంలో బోల్తా పడి నీటిలో పడ్డారు. అప్రమత్తమైన లాంచీ నిర్వాహకులు నీటిలోకి దిగి వారిని క్షేమంగా లాంచీలోకి చేర్చారు.