అమరావతి : మానసిక స్థితి లేని ఓ తల్లి తన నాలుగు నెలల చిన్నారని చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో చోటు చేసుకుంది. హుకుంపేట మండలం తడిగిరి గ్రామంలో అరిసెల రాధిక అనే మహిళ గత కొన్ని నెలలుగా మానసిక స్థితితో బాధపడుతుంది.
పొలం పనులకు వెళ్లిన భర్త సాయంత్రం ఇంటికి రాగా ఇంటిలో చిన్నారి హత్య, భార్య ఉరివేసుకుని ఉండడాన్ని గమనించాడు. కుటుంబ సభ్యులకు, గ్రామ పెద్దలకు సమాచారం అందించగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.