అమరావతి : ఏపీలోని శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో సముద్రంలో తెప్ప బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు సురక్షితంగా బయట పడ్డారు. జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం కొత్తపేట సముద్రతీరంలో ముగ్గురు మత్స్యకారులు చేపల (Fish Hunt) వేటకు వెళ్లారు. అయితే ఒక్కసారిగా తెప్ప బోల్తా పడింది. ఆ ప్రమాదంలో కొత్తపేటకు చెందిన గుంటు యర్రయ్య (58) మృతి చెందగా మరో ఇద్దరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.