అమరావతి: ఏపీలోని నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో ఒకరి మృతి చెందగా మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు. కొత్తూరు సుబ్రహ్మణ్వేర స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాయపాడు నుంచి గగ్గటూరు మార్గమధ్యలో ఉన్న బ్రిడ్జిని దాటుతుండగా వరద ఉద్ధృతికి కారు కొట్టుకుపోయింది. స్థానికులు గమనించి సహాయ చర్యలు చేపట్టి ముగ్గురిని రక్షించగా ఒకరు గల్లంతై మృతి చెందారు. మృతుడు కర్నూలువాసిగా పోలీసులు గుర్తించారు.