హైదరాబాద్: ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటించి, విద్యార్థుల మార్కులను వెబ్సైట్లో పొందుపరచనున్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులకు ఇంటర్ ఫస్టియర్లో వచ్చిన మార్కులనే సెకండియర్ ఫలితాల్లో కేటాయిస్తారు.
రాష్ట్రంలో ఇంటర్ రెండో సంవత్సర పరీక్షలకు ఫీజులు చెల్లించినవారు మొత్తం 4,73,967 మంది ఉన్నారు. వారిలో జనరల్ విద్యార్థులు 4,28,986 మంది, వొకేషనల్ విద్యార్థులు 44,981 మంది ఉన్నారు. పరీక్ష ఫీజులు చెల్లించిన ప్రతి విద్యార్థిని పాస్ చేయనున్నారు.