అమరావతి : ఏపీలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తున్నది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 5,963 కేసులు నమోదయ్యాయి.
వైరస్ బారినపడి 2569 మంది కోలుకున్నారు. 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లో పాజిటివ్ కేసుల సంఖ్య 9,68,000కు చేరింది.
9,12,510 మంది కోలుకోగా.. 48,053 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ్టి వరకు 7437 మంది మరణించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి