అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 18,767 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కొవిడ్-19తో 104 మంది మృత్యువాతపడ్డారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా కేసుల సంఖ్య 15,80,827కి చేరింది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,09,237. ఇప్పటివరకు సంభవించిన కొవిడ్ మరణాలు 10,126కి చేరాయి.
జిల్లాల వారీగా సంభవించిన తాజా కొవిడ్ మరణాల వివరాలిలా ఉన్నాయి. చిత్తూరులో అత్యధికంగా 15 మంది మృతిచెందగా పశ్చిమగోదావరిలో 13, విజయనగరంలో 11, విశాఖపట్నంలో 9, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో 8 మంది చొప్పున, శ్రీకాకుళంలో ఏడుగురు, నెల్లూరులో ఆరుగురు, కడపలో ముగ్గురు మరణించారు.