తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి సుమారు 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. వీరికి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామి వారిని 65,187 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 27,877 మంది భక్తులు తలనీలాలు సమర్పించు కున్నారు. భక్తుల కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5.37 కోట్లు వచ్చిందని వెల్లడించారు.