తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని దర్శించుకోవడానికి 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. వీరికి 12 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 75, 175 మంది భక్తులు దర్శించుకోగా 31,979 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.05 కోట్లు వచ్చిందని వివరించారు.