వేసవి దిగుబడులను ఇచ్చే పంటల్లో ‘నిమ్మ’ ఒకటి. కోత సమయంలోనే ‘రసం పీల్చే రెక్కల పురుగులు’ నిమ్మ రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతాయి. ఇవి పండ్లపై రంధ్రాలను చేసి, రసాన్ని పీలుస్తాయి. ఆ రంధ్రాల్లో శిలీంధ్రాలు, బ్యాక్టీరియా చేరడంతో పండ్లు కుళ్లిపోతాయి. ఫలితంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీని నివారణకు కుళ్లి, రాలిపోయిన పండ్లను ఏరి నాశనం చేయాలి. రాత్రిపూట లైట్లకాంతికి ఈ పురుగులు ఆకర్షితమవుతాయి. కాబట్టి, మార్చి-మే నెలల్లో నిమ్మతోటల్లో కాంతిదీపాలు (ఫ్లొరొసెంట్ బల్బులు) ఏర్పాటు చేసుకోవాలి. వీటికింద
మలాథియాన్-1 మి.లీ. మందు, ఒక శాతం పంచదారను పండ్లరసంతో కలిపిన మిశ్రమాన్ని ఉంచి పురుగులను ఆకర్షించాలి.