ఈమధ్య పంటల్లో రసాయన పురుగు మందులు విచక్షణారహితంగా ఎక్కువ మోతాదులో వాడుతున్నారు. దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్నది. కాలుష్యం పెరిగిపోతున్నది. పంటల్లో పురుగు మందుల అవశేషాలు ఉంటున్నాయి. అలాగే పంటలకు అయ్యే ఖర్చు కూడా ఎక్కువై రైతుల ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. కాబట్టి మన పొలం దగ్గర మనమే జీవ సంబంధిత కీటక నాశనులు తయారుచేసుకోవచ్చు. దీనివల్ల ఖర్చులు తగ్గించుకోవడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతాం. అంతేకాకుండా పురుగు మందుల అవశేషాలు లేని పండ్లు, కాయగూరలను ఉత్పత్తి చేసి, మానవ ఆరోగ్యాన్ని మెరుగుపరుచడంలో దోహదపడుతుంది. పండించిన పంటలకు మార్కెట్లో మంచి ధర పలుకుతుంది.
వేప విత్తన కషాయ ద్రావణం(5 శాతం)
ఆవు పేడ, మూత్ర కషాయం
అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి మిశ్రమం
పొగాకు డికాక్షన్
ఎన్.పి.వి.(NPV) ద్రావణం
నేలవాము ద్రావణం