ఎదులాపురం, జనవరి 26 : ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. రిమ్స్లో తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బండారి కృష్ణ, మాజీ సైనికుల సంఘ భవనంలో సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి జాతీయ జెండాను ఎగురవేశారు. మసీద్ చౌక్లో బెస్ట్ ఫ్రెండ్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, కలెక్టర్ చౌరస్తాలో ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నదానం జగదీశ్వర్, తెలంగాణ ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అజయ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సార్క్ నేషన్స్ ఇంటర్నేషనల్ హ్యూమన్రైట్స్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను జిల్లా చైర్మన్ గుర్రం పున్నం రావు ఎగువేశారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్కేవీ అధ్యక్షురాలు అనసూయ, సభ్యులు ప్రమోద్ కుమార్, దయాకర్, మోహన్, నగేశ్, శ్రీహరి, సైనికుల సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు శంకర్, కెప్టెన్ ఎం హుస్సేన్, సభ్యులు, ఆర్ఎంపీ, పీఎంపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భీముడు, నర్సింహులు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, జనవరి 26 : మండలంలోని లక్కారం, ఘన్పూర్, బీర్సాయిపేట, హస్నాపూర్, మత్తడిగూడ, శ్యాంపూర్, గోండ్గూడ(జీ), నర్సాపూర్(బీ), శ్యాంనాయక్తండా, లక్షెట్టిపేట, కన్నాపూర్, పులిమడుగు, తదితర గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద సర్పంచ్లు జాతీయ జెండాను ఎగురవేశారు. దంతన్పల్లి, లక్కారం, బీర్సాయిపేట, శ్యాంపూర్ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అటవీ శాఖ, ప్రైవేట్ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నార్నూర్, జనవరి 26 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద జడ్పీచైర్మన్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అలాగే నార్నూర్, గాదిగూడ మండలాల్లోని ప్రభుత్వ, పంచాయతీ కార్యాలయాల్లో అధికారులు, ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో తహసీల్దార్లు దుర్వా లక్ష్మణ్, మోతీరాం,ఎంపీడీవోలు రమేశ్, సాయిప్రసాద్, నార్నూర్ సీఐ ప్రేమ్కుమార్, ఎంఈవో రాపెల్లి ఆశన్న, ఎంపీపీలు కనక మోతుబాయి, ఆడ చంద్రకళారాజేశ్వర్, వైస్ ఎంపీపీలు జాదవ్ చంద్రశేఖర్, యోగేశ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బేల, జనవరి 26 : మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ బడాల రాంరెడ్డి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో భగత్ రవీందర్, గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఇంద్రశేఖర్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కృష్ణ కుమార్, ఐకేపీలో ఏపీఎం రాజారెడ్డి, అటవీ శాఖ కార్యాలయంలో ఎఫ్ఆర్వో అరుణ, వివిధ గ్రామాల పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్లు, పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వనితాఠాక్రే, జడ్పీటీసీ అక్షిత పవార్, నాయకులు గంభీర్ఠాక్రే, దేవన్న, సతీశ్ పవార్, ప్రమోద్ రెడ్డి, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, జనవరి 26 : మండల కేంద్రంతో పాటు మండలంలోని గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ ముంజం సోము, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సునీల్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో పుష్పలత, గ్రంథాలయంలో ఎంపీపీ పోటే శోభాబాయి, ఏఎంసీ కార్యాలయంలో కార్యదర్శి రాజేశ్వర్, పీఏసీఎస్లో చైర్మన్ మారుతిపటేల్డోంగ్రే, జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు గోపాల్సింగ్తిలావత్, ఇంద్రవెల్లి పీహెచ్సీలో డాక్టర్ శ్రీకాంత్, పశువైద్యశాలలో సుదేశ్, అటవీ శాఖ కార్యాలయంలో ఎఫ్ఆర్వో శీలానంద్, ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీ, అంబేద్కర్ చౌక్లో సర్పంచ్ గాంధారి త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శోభాబాయి, జడ్పీటీసీ పుష్పలత, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎంఏ అమ్జద్, డిప్యూటీ తహసీల్దార్ రమేశ్, వైస్ ఎంపీపీ పడ్వాల్ గోపాల్సింగ్, ఎంపీటీసీలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఎదులాపురం, జనవరి 26 : ఏక్తా టాక్సీ డ్రైవర్స్ అండ్ యూనియన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. రవాణా శాఖ డిప్యూటీ కమీషనర్ పుప్పాల శ్రీనివాస్ మహనీయుల చిత్రపటాలకు పూలమాల వేసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు ఇలియాజ్ అహ్మద్, ఉపాధ్యక్షుడు షేక్ ఇక్బాల్, ప్రధాన కార్యదర్శి రషీద్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, జనవరి26: మండల కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో కదం సురేశ్ జాతీయ జెండాను ఎగురవేశారు. తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ భోజన్న, గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేకాధికారి, ఎంపీడీవో తిరుమల, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పంద్ర జైవంత్రావ్, గిరిజన ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ బానోత్ హరిత, ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ స్వామి, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రమేశ్ జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.