నిర్మల్ అర్బన్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు టీఆర్ఎస్ అండగా నిలుస్తుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.సోమవారం పట్టణంలోని దివ్యగార్డెన్లో టీఆర్ఎస్ నిర్మల్ నియోజక వర్గ విస్తృత స్థాయి సన్నాహక సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తుందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఎన్నికల్లో ఇవ్వని అనేక హామీలను అమలు పర్చామని అన్నారు.
ఇతర పార్టీలు తమ మనుగడను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ను, ఇతర మంత్రులను విమర్శిస్తున్నారని వారి విమర్శలను కార్యకర్తలు, ముఖ్యనాయకులు తిప్పి కొట్టాలని దిశానిర్ధేశం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, నాయకులు లోక భూమారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, డీసీసీబీ చైర్మన్ రఘునందన్ రెడ్డి, నల్లా వెంకట్ రాంరెడ్డి, యువ నాయకులు అల్లోల గౌతం రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు పాకాల రాంచందర్, పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మదా ముత్యం రెడ్డి తదితరులున్నారు.