కుభీర్ : రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ( State Teachers Union ) ఉపాధ్యక్షుడిగా నాంపల్లి నాగభూషణ్ (Nampally Nagabusan) ఎన్నికయ్యారు. హైదరాబాద్ లోని ఆ సంఘ భవనంలో జరిగిన రాష్ట్ర 79వ వార్షిక కౌన్సిల్ సమావేశంలో నిర్వహించిన ఎన్నికలలో నిర్మల్ జిల్లా కుభీర్ మండలం నిగ్వా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న నాంపల్లి నాగభూషణ్ ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ( Vice President) ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా ఆయన బుధవారం మండల కేంద్రంలో మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, సీపీఎస్ రద్దు, రిటైర్డ్ ఉపాధ్యాయుల బకాయిలు, ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం తమ సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కత్తి నాగోరావ్, గాడేకర్ పవన్, ఉపాధ్యాయులు నాగభూషణ్కు అభినందనలు తెలిపారు.