బెల్లంపల్లి, జనవరి 12 : మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్పై అసమ్మతి కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. శుక్రవారం స్థానిక మున్సిపల్ మీటింగ్ హాల్లో ప్రిసైడింగ్ అధికారి హరికృష్ణ ఆధ్వర్యంలో అవిశ్వాస సమావేశం నిర్వహించారు. ఉదయం 11 గంటలకు సమావేశానికి 20 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు.
అవిశ్వాసానికి 22 మంది కౌన్సిలర్లు అవసరం ఉండగా హాజరైన కౌన్సిలర్లు తమకు కొంత సమయం కావాలని కోరడంతో మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశాన్ని వాయిదా వేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో 20 మంది కౌన్సిలర్లు మాత్రమే ఉండడంతో ప్రిసైడింగ్ అధికారి కోరం లేక అవిశ్వాసం వీగిపోయిందని ప్రకటించారు. మధ్యాహ్నం 12.30 గంటలకుమున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాసం కూడా కోరం లేక వీగిపోయింది. దీంతో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ యథావిధిగా పదవుల్లో కొనసాగనున్నారు.