నిర్మల్ అర్బన్, ఆగస్టు 31 : అన్నా చెల్లెళ్లు అక్కా తమ్ముళ్ల మధ్య అనుబంధం, ఆప్యాయతకు ప్రతి రూపం రక్షా బంధన్ అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆయన సోదరీమణి రాఖీ కట్టి మిఠాయిలు తినిపిం చారు.తోబుట్టువుల మధ్య రాఖీ పండుగ జరుపు కోవడం సంతోషంగా ఉందని మంత్రి పేర్కొ న్నారు.
ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డికి..
భైంసా, ఆగస్టు 31 : భైంసాలో రక్షా బంధన్ వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే విఠల్రెడ్డికి మైనార్టీ నాయకులు రాఖీ కట్టి శుభా కాంక్షలు తెలిపారు.
ఆదిలాబాద్ ఎమ్మెల్యేకు..
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 31 : ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న నివాసంలో రాఖీ వేడుకలు ఘనంగా జరాగాయి. ఎమ్మెల్యే జోగు రామన్నకు సోదరి రాఖీని కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ రాఖీ కట్టి అభిమానాన్ని చాటుకున్నారు. దుర్గం శేఖర్, సాజిదుద్దీన్, పర్వీన్, రేవతి బెంజి, కస్తాల ప్రేమల, ఆసిఫ్, ఖయ్యుం పాల్గొన్నారు.
జాదవ్ అనిల్కు ..
నేరడిగొండ, ఆగస్ట్టు 31 : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ రాఖీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనిల్కు అక్కా చెల్లెళ్లు రాఖీ కట్టారు. అలాగే స్థానిక శిశుమందిర్ విద్యా ర్థులు, ఉపాధ్యాయులు జాదవ్ అనిల్, వీడీసీ చైర్మన్ రవీందర్రెడ్డికి రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.