జన్నారం, మార్చి 15 : తోటి అధికారుల వేధింపులు భరించలేక కడెం నీటి పారుదల శాఖ ఉద్యోగి ఆత్యహత్యాయత్నం చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం గ్రామానికి చెందిన తోకల రాకేశ్ నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ నీటి పారుదల శాఖలో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. అదే శాఖలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు వేధిస్తుండడంతో శుక్రవారం ఇంటిలో పురుగుల మందు తాగాడు. అతడి తల్లి సరస్వతి గమనించి కరీంనగర్లోని ప్రతిమ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం రాకేశ్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఏమీ చెప్పడం లేదని, తన కుమారుడిని వేధించిన ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.