నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 27: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నేటి నుంచి రెగ్యులర్, ఒకేషనల్ ప్రథమ సంవత్స రం, 29వ తేదీ నుంచి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరుగనున్నాయి. మా ర్చి 16వ తేదీతో ముగియనున్నాయి. కాగా.. జిల్లావ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్స రం కలిపి 13,345 మంది హాజరుకానున్నా రు. ఇందులో ప్రథమ సంవత్సరంలో రెగ్యులర్ విద్యార్థులు 5,463, ఒకేషనల్ 1,072 మొత్తం 6,535 మంది.. ద్వితీయ సంవత్సరంలో రెగ్యులర్ విద్యార్థులు 5,772, ఒకేషనల్ 1,038 మొత్తం 6,810 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. వీరికి నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజక వర్గాల్లో 23 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పకడ్బందీగా నిర్వహణ
కేంద్రాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ విధించారు. ము థోల్, భైంసాలో ఏర్పాటు చేసిన కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి నిఘా పెంచా రు. మండలానికి ఒకే కళాశాల ఉన్నచోట ఎనిమిది సెల్ఫ్ సెంటర్స్ను ఏర్పాటు చేశారు. మాస్ కాపీయింగ్ నిరోదానికి మూడు ఫ్లయింగ్ స్కాడ్, రెండు సిట్టింగ్ స్కాడ్ బృందాలు, పరీక్షల పర్యవేక్షణకు ముగ్గురు జిల్లాస్థాయి అధికారులు, ఇందులో డీఐఈవో, సీనియర్ ప్రిన్సిపాల్, సీనియర్ లెక్చరర్తో ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. మాస్ కాపీయింగ్కు పాల్పడితే 79979 94358 నంబర్కు ఫోన్ చేస్తే చర్యలు తీసుకుంటారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష గదిలోకి అనుమతించరు. గంట ముందుగానే చేరుకోవాలి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
పకడ్బందీగా నిర్వహిస్తాం..
– పరశురాం, డీఐఈవో, నిర్మల్.
విద్యార్థులకు హాల్ టికెట్లను జారీ చేశాం. హాల్టికెట్స్ ఇంటర్ నెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు కళాశాల యాజమాన్యాలను కూడా హాల్ టికెట్లను జారీ చేయాలని ఆదేశించాం. నెట్ సెంటర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరుకావచ్చు.
ఆదిలాబాద్ జిల్లాలో 30 కేంద్రాలు..
ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 27 : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆదిలాబాద్ డీఐఈవో రవీంద్రకుమార్ మంగళవారం తెలిపారు. 30 కేం ద్రాలను ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.