మంచిర్యాల అర్బన్, జనవరి 27 : అవగాహన ఉంటే ఎలాంటి ప్రమాదాలనైనా ఎదుర్కోవచ్చని నేషనల్ డిసార్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) ఇన్స్పెక్టర్ బెటిన్ సింగ్ అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విపత్తులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, సోషల్ వెల్ఫేర్ కాలేజ్, ఎస్ఆర్కేఎం నర్సింగ్ కళాశాల విద్యార్థులతో ప్రాక్టికల్స్ చేయించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డి, ఐఆర్సీఎస్ జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చక్రపాణి, ఎన్సీసీ ఆఫీసర్ తిరుపతి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి సంతోష్, కిశోర్, ఎన్డీఆర్ఎఫ్ ప్రతినిధి సందీప్కుమార్ రెడ్డితో పాటు 15 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు పాల్గొన్నారు.