వాంకిడి, జనవరి 11 : అక్రమంగా రేషన్ బియ్యం అమ్మిన రాంనగర్ రేషన్ డీలర్ వనపర్తి సునీత, భర్త భాసర్పై కేసు నమోదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డీటీ రాజ్ కుమార్ తెలిపారు. గురువారం మండలంలోని రాంనగర్ 2411015 నంబర్ గల రేషన్ షాపును ఆయ న తనిఖీ చేసి,షాపులో నిల్వలను పరిశీలించారు.
39 క్వింటాళ్ల రేషన్ బియ్యం తకు వ రావడంతో విచారించగా రూ.12 కిలో చొప్పున ముజాహీద్ అలియాస్ ముజ్జుకు అక్రమంగా విక్రయించినట్లు తెలియడంతో రేషన్డీలర్ సునీత, భర్త భాసర్, ముజ్జు పై 6ఏ కేసు ఈసీ యాక్ట్ 1955 ప్రకారం కేసు నమోదు చేసి, డీలర్ వద్ద గల 45 క్వింటాళ్లతో పాటు ఇతర సామగ్రిని సీజ్ చేసినట్లు పేరొన్నారు.
రేషన్ బియ్యం ప్రజలకు పంపిణీ చేయకుండా దుర్వినియోగం చేసే రేషన్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలాఉండగా సదరు డీలర్ వద్ద నుం చి సుమారు 45 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, ఈ పాస్ డివైజ్, కాంటాను ప్రజల సౌకర్యార్థం బియ్యం పంపిణీ చేయడానికి 14వ షాపు డీలర్కు ఇన్చార్జి బాధ్యతలు ఆయన అప్పగించారు. ఆయన వెంట జూనియర్ అసిస్టెంట్ జమ్నుదాస్ ఉన్నారు.