దహెగాం,జనవరి 10: ఆడపిల్లల ఆరోగ్యంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎమ్మెల్యే పాల్యాయి హరీశ్బాబు అన్నారు. భేటీ బచావో- భేటీ పడావో కార్యక్రమంలో భాగంగా స్థానిక కేజీబీవీలో విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన అహారపు అలవాట్లతో పాటు మంచి నిద్ర, రోజుకు కొంత సమయం వ్యాయామం చేయాలని, ఆటలాడాలని సూచించారు. తహసీల్దార్ కల్పన, ఎంపీడీవో రాజేశ్వర్గౌడ్, డీఎంహెచ్వో తుకారాం, డిప్యూటీ డీఎంహెచ్వో సీతారాంనాయక్, వైద్యులు స్పందన, సురేందర్, ఎస్వో రిజ్వానా, తదితరులున్నారు.